కర్నూలు సిటీ: ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇబీసీ, డిజెబుల్డ్, మైనార్టీ విద్యార్థులు 2016–17 సంవత్సరానికి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిపుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు గడువు పెంచినట్లు సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కొత్తగా దరఖాస్తు చేసుకునే వావారికి వచ్చే నెల 15లోపు, రెన్యూవల్ చేసుకునే వారికి ఈ నెల 31 వరకు గడువు పెంచారు. దరఖాస్తూలను http://apepass.cgg.gov.in లో పొందవచ్చు.