హుస్నాబాద్: కరీంనగర్ జిల్లా హుస్నాబాద్, కోహెడ మండలాలను సిద్ధిపేటలో కలపవద్దంటూ ప్రజలు ఆందోళనకు దిగారు. సిద్ధిపేటలో కలపడాన్ని నిరసిస్తూ పట్టణంలో ప్రజలు ర్యాలీ తీశారు. పలుచోట్ల పోలీసులకు ప్రజలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.