రైలు కింద పడి న్యాయవాది ఆత్మహత్మ

4 Oct, 2016 23:44 IST|Sakshi

గుంతకల్లు : ప్రముఖ న్యాయవాది, బార్‌ అసోసియేషన్‌ పట్టణాధ్యక్షుడు ఎన్‌వీ మస్తానప్ప(51) రైలు కిందపyì  ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం రాత్రి స్థానిక హనుమాన్‌ జంక్షన్‌లో రైలు కింద పడి ఎవరో మరణించారని తిరుపతి–గుంతకల్లు ప్యాసింజర్‌ డ్రైవర్‌ నుంచి గుంతకల్లు రైల్వే పోలీసులకు సమాచారం అందింది. వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యంలో బీరప్ప గుడి సర్కిల్‌లో మృతదేహాన్ని గుర్తించిన పాతగుంతకల్లు వాసులు కొందరు గుడిసిగేరు వీధిలో నివాసముంటున్న లాయర్‌ మస్తానప్ప కుటుంబ సభ్యులకు తెలిపారు.

ఆయన భార్య సుజాత, బంధువులు ఆసుపత్రికి చేరుకుని మృతదేహం చూసి బావురుమన్నారు. కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్న మస్తానప్ప సోమవారం రాత్రి భరించలేని నొప్పి రావడం వల్ల రైలు కిందపడి మరణించి ఉంటాడని వాపోయారు. ఆయనకు కుమారుడు చైతన్యకృష్ణ, కుమార్తె రజిత ఉన్నారు. ఈ మేరకు జీఆర్‌పీ ఎస్‌ఐ రమేష్‌బాబు కేసు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు