న్యాయ సహాయానికి కృషి

16 Aug, 2016 00:34 IST|Sakshi
జిల్లా కోర్టులో జెండావిష్కరణ దృశ్యం
  • జిల్లా న్యాయమూర్తి సిహెచ్‌.విజయ్‌కుమార్‌
  • ఖమ్మం లీగల్‌: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో త్రివర్ణ పతాకాన్ని జిల్లా న్యాయమూర్తి సిహెచ్‌.విజయ్‌కుమార్‌ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరికీ న్యాయ సహాయం అందించేందుకు న్యాయ సేవాసదన్‌ కృషి చేస్తున్నదన్నారు. అదనపు జిల్లా జడ్జి రాధాకృష్ణ, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బండారుపల్లి గంగాధర్, జడ్జీలు మాధవీకృష్ణ, అమరావతి, పంచాక్షరి, సతీష్‌కుమార్, న్యాయ సేవాసదన్‌ కార్యదర్శి వీఏఎల్‌ సత్యవతి, న్యాయ శాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు దండి ప్రేమ్‌కుమార్, బార్‌ అసోసియేషన్‌ బాధ్యులు మేకల సుగుణారావు, శ్రీనివాస గుప్తా, ఎన్‌.రాము, అమర్‌నా«ద్, లక్ష్మీనారాయణ, ఇంద్రాచారి, కన్నాంబ తదితరులు పాల్గొన్నారు.
     
మరిన్ని వార్తలు