గ్రంథాలయాలు విజ్ఞాన బాండగారాలు

24 Aug, 2016 22:27 IST|Sakshi
గ్రంథాలయాలు విజ్ఞాన బాండగారాలు

కొమరబండ(కోదాడరూరల్‌):  గ్రంథాలయాలు విజ్ఞాన బాండగారాలని విశాఖపట్టణం జాయింట్‌ కలెక్టర్‌ లోతెట్టి శివశంకర్‌ అన్నారు. బుధవారం మండల పరిధిలోని కొమరబండలో  యువశక్తి యువజన సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన గ్రంథాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువజన సంఘం ఆధ్వర్యంలో గ్రంథాలయాన్ని నిర్మించడం అభినందనీయమన్నారు . విద్యార్థులు,  యువకులు, విద్యావంతులు ఇలాంటి గ్రంథలయాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ కల్యాణ్‌చక్రవర్తి, డాక్టర్‌ పెంటయ్య, ఎసీటీఓ రవీందర్, యువజనసంఘ సభ్యులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు