గుంటూరు ఎడ్యుకేషన్: ఆంగ్ల భాషా ప్రాముఖ్యతను చాటుతూ లిటరేచర్ కార్నివాల్– ఇంగ్లీష్ ఫెస్ట్ పేరుతో ఐదు రోజులు వివిధ కార్యక్రమాలు నిర్వహించినట్లు నవభారత్నగర్లోని శ్రీచైతన్య సీబీఎస్ఈ పాఠశాల ప్రిన్సిపాల్ శివప్రసాద్ తెలిపారు. నవభారత్ నగర్లోని పాఠశాలలో ఇంగ్లీష్ ఫెస్ట్ ముగింపు సందర్భంగా శనివారం ప్రముఖ రచయిత ఆర్కే నారాయణ్కు సాహిత్య కార్యక్రమాలను అంకితం చేశారు. విద్యార్థులతో పద్యాలు పాడించి, వివిధ రకాల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ డాక్టర్ డానియేల్, స్కూల్ ఏజీఎం డాక్టర్ నూతలపాటి అంజయ్య, ఆర్ఐ శ్రీనివాస్, డీన్ మురళీకృష్ణ, వైస్ ప్రిన్సిపాల్ కమల, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.