దాచేపల్లి మండలంలోని కాట్రపాడు పుష్కర ఘాట్లో శివుడి విగ్రహాన్ని నిర్మిస్తున్నారు. పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. మండలానికి చెందిన డాక్టర్ కనుమూరి విక్రాంత్, గురజాలకు చెందిన డాక్టర్ చల్లగుండ్ల శ్రీనివాస్ సుమారు రూ.4 లక్షల వ్యయంతో దీన్ని నిర్మిస్తున్నారు. తొమ్మిది అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పు ఉండే ఈ విగ్రహాన్ని రాజమండ్రికి చెందిన శిల్పులు వనమాటి సురేష్కుమార్, వనమాటి రాజు నేతత్వంలో రూపొందిస్తున్నారు. ఘాట్ వద్ద ఈ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా మారింది.
– దాచేపల్లి