నెల్లూరు : డ్రైవర్ మద్యం మత్తులో లారీ నడపడంతో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ సంఘటన గురువారం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు సమీపంలోని వెంకటగిరి బైపాస్ రోడ్డులో చోటు చేసుకుంది.ఈ ఘటనలో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి డ్రైవర్ను గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అయితే వాహనం బోల్తా పడటంతో లారీలోని కూరగాయలన్నీ రహదారిపై పడిపోయాయి. దాంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని అందువల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు.