శంషాబాద్ రూరల్: ఔటర్ రింగ్ రోడ్డుపై ఓ టిప్పర్ లారీ బోల్తా పడగా డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పోశెట్టిగూడ సమీపంలో మంగళవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. కందుకూరు నుంచి గచ్చిబౌలి వైపు డాంబరు లోడుతో ఈ లారీ వెళుతోంది. మృతుడ్ని మహబూబ్నగర్ జిల్లా ఆమన్గల్ వాసి జి.విజయ్కుమార్గా పోలీసులు గుర్తించారు.