లారీ ఢీకొని మహిళ మృతి

6 Mar, 2016 12:41 IST|Sakshi

పొన్నూరు: రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందిన సంఘటన గుంటూరు జిల్లా పొన్నూరులో ఆదివారం ఉదయం జరిగింది. పొన్నూరుకు చెందిన పటాన్ ఫైజున్నీసాబేగం(60) మర్కస్ మసీద్ సమీపంలో రోడ్డు మీద నడచి వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన ఇసుక లారీ ఢొకొట్టింది. ఈ ఘటనలో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఇసుక లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు.

 

మరిన్ని వార్తలు