లారీ బోల్తా : ఒకరి మృతి

27 Apr, 2016 08:53 IST|Sakshi

ప్రత్తిపాడు: తూర్పుగోదావరి జిల్లాలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్తున్న మేకల లారీ అదుపు తప్పి ప్రత్తిపాడు జాతీయ రహదారిపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే చనిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.

>
మరిన్ని వార్తలు