పెద్దలు ప్రేమకు అంగీకరించకపోవడంతో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. కర్నూలు జిల్లా మహానంది ప్రాంతానికి చెందిన అశోక్, అహోబిలానికి చెందిన రజిత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. పెద్దలు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో శుక్రవారం ఉదయం మహానంది సమీపంలోని ఎంసీఫారమ్ గ్రామ అటవీ ప్రాంతంలో కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోగా ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.