పురుగుల మందు తాగి ప్రేమజంట ఆత్మహత్య

19 Jan, 2016 09:45 IST|Sakshi
పురుగుల మందు తాగి ప్రేమజంట ఆత్మహత్య
నార్కెట్‌పల్లి: కులాలు వేరు కావడంతో తమ ప్రేమను పెద్దలు అంగీకరించని కారణంగా ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన నల్గొండ జిల్లా అక్కినపల్లి గ్రామంలోని రామాలయం పక్కన ఉన్న కోనేరు వద్ద మంగళవారం ఉదయం వెలుగు చూసింది. నల్గొండ మండలం దోమలపల్లికి చెందిన రమేష్, ప్రసన్న ప్రేమించుకున్నారు. రమేష్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తుండగా, ప్రసన్న ఇంటర్ ఫైనలియర్ చదువుతోంది.
 
ఇద్దరి కులాలు వేరు కావడంతో వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. దాంతో జీవితంపై విరక్తి చెందిన ఇద్దరూ సోమవారం రాత్రి అక్కినపల్లికి వెళ్లి అక్కడి రామాలయం వద్ద కోనేటి గట్టుపై పురుగుల మందు తాగి మృతి చెందారు. మంగళవారం ఉదయం మృతదేహాలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
 
మరిన్ని వార్తలు