ఒక్కటైన ప్రేమ జంట

26 Aug, 2016 21:59 IST|Sakshi
ఒక్కటైన ప్రేమ జంట

విజయనగరం జిల్లా : ఇద్దరు కలిసి చదువుకున్నారు. అమ్మాయి చదువు పూర్తి చేసుకుని గాజువాకలోని ఓ హోటల్‌లో ఉద్యోగం చేస్తోంది. అబ్బాయి ఉద్యోగ ప్రయత్నం కోసం గాజువాక వ చ్చి అమ్మాయి ఉంటున్న గదిలో చేరాడు. వీరి స్నేహం ప్రేమ గా మారింది. రెండు రోజుల కిందట అబ్బాయి తండ్రి వచ్చి, అతన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అమ్మాయి తనను మోసం చేశాడని అబ్బాయిపై గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల కౌన్సెలింగ్ అనంతరం ఇద్దరు ఒక్కటయ్యారు.  
 
 పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
 విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలం, ఇటిక గ్రా మానికి చెందిన తవిటి నాయుడు కుమార్తె రమ పాతగాజు వాకలోని ఓ హోటల్‌లో రిసెప్షెనిస్ట్‌గా పనిచేస్తూ గది అద్దెకు తీసుకుని ఉంటోంది. అదే గ్రామానికి చెందిన పైడా సతీష్  ఫార్మాసిటీలో ఉద్యోగ ప్రయత్నం కోసం గాజువాక వచ్చి గ తంలో కలిసి చదువుకున్న పరిచయంతో ఆమెను కలిశాడు. ఈ క్రమంలో ఇద్దరు కలిసి ఒకే గదిలో నివసిస్తున్నారు. అది కాస్తా ప్రేమగా మారింది. ఈ విషయం తెలుసుకున్న సతీష్ తండ్రి వచ్చి, అతన్ని తనతో తీసుకెళ్లడానికి సిద్ధమయ్యాడు.
 
  సతీష్ కూడా తండ్రి అండతో వెళ్లిపోవడానికి సిద్ధమయ్యా డు. ఇద్దరి మధ్య రెండు రోజులుగా గొడవలు జరిగాయి. చివరికి ఈ వ్యవహారం గాజువాక పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. మోసం చేశాడని సతీష్‌పై రమ ఫిర్యాదు చేసింది. ఈ క్రమం లో తల్లిదండ్రులు, గ్రామపెద్దల సమక్షంలో ఇద్దరికి ఏసీపీ, సీఐలు కౌన్సిలింగ్‌ఇచ్చారు. అయినా సతీష్ తీరు మారకపోవడంతో.. మహిళ కేసు పెడితే జరిగే పరిణామాలను చెప్పి హెచ్చరించారు. గురువారం సాయంత్రం బీహెచ్‌పీవీ గేటు ఎదురుగా ఉన్న వినాయస్వామి ఆలయంలో దండలు మార్చుకుని వారిద్దరూ ఒక్కటయ్యారు. ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, హోటల్ యజమాని రోహిత్‌లు పెద్దలుగా వ్యవహరించి వివాహాన్ని జరిపించారు.  
 

>
మరిన్ని వార్తలు