మద్ది ఆలయ హుండీ ఆదాయం రూ.17 లక్షలు

29 Oct, 2016 21:52 IST|Sakshi
జంగారెడ్డిగూడెం రూరల్‌ : జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి వారి ఆలయ హుండీ లెక్కింపు శనివారం నిర్వహించారు. 52 రోజులకు ఆలయానికి వచ్చిన ఆదాయాన్ని లెక్కించగా రూ.17,06,268 లభించినట్టు ఈవో పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. నోట్ల రూపంలో రూ.15,78,406, నాణేల రూపంలో రూ.1,27,862, 3 విదేశీ కరెన్సీలు లభించాయి. కోట సత్తెమ్మ అమ్మవారి ఆలయ ఈవో యాళ్ల శ్రీథర్‌ పర్యవేక్షణలో ఈ హుండీ లెక్కింపు నిర్వహించారు. ఆలయ సిబ్బంది, నోవా విద్యార్థులు, కరూర్‌ వైశ్యాబ్యాంక్‌ సిబ్బంది హుండీ లెక్కింపులో పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు