'తాగడానికి నీరివ్వకుండా.. బీరు కంపెనీలకు ధారపోత'

17 Apr, 2016 17:40 IST|Sakshi

భీమ్‌గల్ (నిజామాబాద్) : ప్రజలు తాగేందుకు నీరు ఇవ్వకుండా తెలంగాణ సర్కారు బీరు కంపెనీలకు మాత్రం నీటిని సరఫరా చేస్తోందని ఏఐసీసీ నాయకుడు మధుయాష్కీ మండిపడ్డారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, తీవ్ర నీటి కరువుతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే తగిన చర్యలు తీసుకోవడంలో సర్కారు విఫలమైందని విమర్శించారు. 

మరిన్ని వార్తలు