ధర్మవరం అర్బన్ : బత్తలపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఓ బాలిక (14)పై ఈ నెల 16, 17వ తేదీల్లో లైంగికదాడికి పాల్పడిన ఆటో డ్రైవర్ సాకే శ్రీరాములును అరెస్ట్ చేసినట్లు పట్టణ సీఐ హరినాథ్ తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను స్థానిక పట్టణ పోలీస్స్టేషన్లో సీఐ హరినాథ్ మంగళవారం విలేకరులకు ఇలా వివరించారు.
బత్తలపల్లి మండలం రాఘవంపల్లికి చెందిన సాకే శ్రీరాములు చెడు వ్యసనాలకు బానిసవడంతో అతడి భార్య నాలుగేళ్ల క్రితం వదిలిపెట్టి పుట్టింటికి వెళ్లింది. దీంతో శ్రీరాములు నిత్యం తాగుతూ తిరిగేవాడు. ఈ నేపథ్యంలో ఆర్డీటీ చిల్డ్రన్స్ హోంలో చదువుతున్న ఓ బాలికపై కన్నేశాడు. ఈనెల 16న ఆర్డీటీ చిల్డ్రన్స్ హోం నుంచి స్కూల్కు వస్తున్న బాలికను స్కూల్లో దింపుతానని నమ్మించి ఆటోలో ఎక్కించుకున్నాడు. బాలికల ఉన్నత పాఠశాల వెనుకవైపు ఉన్న కంపచెట్లలోకి బలవంతంగా తీసుకెళ్లి లైంగికదాడి చేశాడు. మరుసటిరోజు కూడా కంపచెట్లలోకి తీసుకెళ్లి లైంగికదాడి చేశాడు. బాధితురాలి పెదనాన్న లక్ష్మినారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయగా ఈనెల 27వతేదీన బత్తలపల్లి వీఆర్వో పెద్దన్న ఎదుట నిందితుడు శ్రీరాములు లొంగిపోయాడన్నారు. అతనిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచామని సీఐ తెలిపారు. నిందితుడ్ని అరెస్టు చేసిన వారిలో బత్తలపల్లి ఎస్ఐ హారూన్బాషా, సిబ్బంది పాల్గొన్నారు.