తాండూరు: ఆదిలాబాద్ జిల్లా తాండూరు మండలం కాశీపేట గ్రామానికి చెందిన ఓ యువకుడు రైలు కింద పడి మృతి చెందాడు. గ్రామం సమీపంలోని రైలు పట్టాలపై ఆదివారం ఉదయం బుద్దర్తి కిరణ్ (25)మృతదేహాన్ని స్థానికులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఆత్మహత్య చేసుకున్నాడా లేక ప్రమాదవశాత్తూ మృతి చెందాడా అన్న కోణంలో రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.