భార్య పుట్టింటికి వెళ్లిందని..

13 Jun, 2016 20:41 IST|Sakshi

పాల్వంచ(ఖమ్మం): భార్య పుట్టింటికి వెళ్లిందని మనస్తాపానికి గురైన ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా పాల్వంచ మండలం నాగారంలో సోమవారం రాత్రి వెలుగుచూసింది. గ్రామానికి చెందిన పి. శ్రీను(26)కు రెండేళ్ల క్రితం వివాహమైంది.

ఈ మధ్య కాలంలో తాగుడికి బానిసైన శ్రీను భార్యతో గొడవపడుతుండటంతో.. విసిగి వేసారిన ఆమె ఈ రోజు పుట్టింటికి వెళ్లింది. దీంతో మనస్తాపానికి గురైన శ్రీను పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు