దామరచర్ల: దామరచర్ల మండల కేంద్రంలో సోమవారం ద్విక్రవాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. గరిడేపల్లి మండలం కల్మల చెర్వుకు చెందిన సంబందాల భిక్షం(55) పెట్రోల్బంక్ సమీపంలో రోడ్డు దాటుతుండగా వేగంగా వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. బాదితుడిని వైద్యచికిత్సకై మిర్యాలగూడకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కేస్ నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.