గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

24 Sep, 2016 00:24 IST|Sakshi
యాదగిరిగుట్ట
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన మండలంలోని వంగపల్లిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..శుక్రవారం తెల్లవారుజామున తీవ్ర గాయాలతో గ్రామంలోని రోడ్డుపై పడి ఉన్న వ్యక్తిని స్థానికులు గమనించారు.  క్షతగాత్రుడిని 108 వాహనంలో భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడు 40 సంవత్సరాల వయస్సు కలిగి ఉంటాడని తెలిపారు. అతడు ఎవరనేది తెలియదని, గుర్తుతెలియని వాహనం ఢీకొట్టిందని పేర్కొన్నారు. కాగా ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందలేదు. 
 
మరిన్ని వార్తలు