అమరావతి : గుంటూరు జిల్లా అమరావతి సమీపంలోని విజయవాడ రోడ్డులో బుధవారం ప్రమాదం చోటుచేసుకుంది. బైక్పై వెళ్తున్న నరేందర్ నాయక్(33) అనే వ్యక్తిని బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో నాయక్ అక్కడకిక్కడే తీవ్రగాయాలతో మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.