ఘోర ప్రమాదం.. హెల్మెట్లోనే తల

20 Mar, 2017 13:45 IST|Sakshi
ఘోర ప్రమాదం.. హెల్మెట్లోనే తల

విజయనగరం:
ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన విజయనగరం జిల్లా గొట్టాం దగ్గర సోమవారం చోటుచేసుకుంది. విశాఖ నుంచి పార్వతీపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. దీంతో ద్విచక్రవాహనం పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు.

ఈ ప్రమాదంలో మృతుడి తల, మొండెం వేరు వేరు కావడంతో అక్కడ భీతావహ పరిస్థితి నెలకొంది. మృతుడు బలిజపేట మండలం నూకలవాడకు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు