నిర్మాణ పనుల్లో అపశృతి: కార్మికుడు మృతి

13 Mar, 2016 15:14 IST|Sakshi

నర్మెట్ట : వరంగల్ జిల్లా నర్మెట్ట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నూతన భవన నిర్మాణ పనుల్లో ఆదివారం ప్రమాదం చోటుచేసుకుంది. భవన నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన సెంట్రింగ్ కుప్పకూలి కార్మికుడిపై పడిపోయింది. దీంతో జెల్ల రవి (25) అనే కార్మికుడు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు.

మరిన్ని వార్తలు