కారు ఢీకొని వ్యక్తి మృతి

4 Mar, 2017 22:55 IST|Sakshi

శింగనమల : మండల పరిధిలోని గార్లదిన్నె సమీపంలో హైదరాబాద్‌-బెంగుళూరు హైవే రోడ్డు దాటుతున్న ఒక వ్యక్తి కారు ఢీకొన్న ప్రమాదంలో మరణించారు. మండలంలోని రఘనాథపురం గ్రామానికి చెందిన సూర్యనారాయణరెడ్డి(45) గార్లదిన్నె సమీపంలోని హైవే రోడ్డు పక్కన హోటల్‌ నిర్వహిస్తున్నారు. శనివారం రాత్రి 8 గంటల సమయంలో హోటల్‌ నుంచి అటువైపు వెళ్లడానికి రోడ్డు దాటుతుండగా అనంతపురం నుంచి హైదరాబాద్‌కు వెళ్లుతున్న కారు ఢీకొంది. ఆయన అక్కడికక్కడే మృతి చెందారు.

మరిన్ని వార్తలు