రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

29 Aug, 2017 22:54 IST|Sakshi
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

వజ్రకరూరు: మండలంలోని కొనకొండ్ల సమీపంలో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఏఎస్‌ఐ బాషా తెలిపిన మేరకు.. ఛాయాపురం గ్రామానికి చెందిన సుబ్బరాయుడు (45)గుంతకల్లు నుంచి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంలో వస్తున్నాడు. కొనకొండ్లలోని ఐటీఐ కళాశాల వద్ద ఎదురుగా వస్తున్న ఆటోను ద్విచక్రవాహనం ఢీకొనడంతో ప్రమాదంలో సుబ్బరాయుడు అక్కడిక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలాన్ని ఉరవకొండ సీఐ చిన్నగౌస్‌ పరిశీలి ంచారు. వజ్రకరూరు ఏఎస్‌ఐ బాషా, పోలీసులు వివరాలు నమోదు చేసుకున్నారు. మృతుడికి భార్యతోపాటు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. 

మరిన్ని వార్తలు