ఇరు వర్గాల ఘర్షణ.. వ్యక్తి మృతి

12 Dec, 2016 13:52 IST|Sakshi

భీమవరం(పశ్చిమగోదావరి): ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి మృతిచెందగా.. పలువురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానిక గెస్ట్‌హౌస్ రోడ్‌లో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. చినికి చినికి గాలి వానలా మారిన వివాదం ఒకరి పై ఒకరు దాడి చేసుకునే వరకు వెళ్లింది.

ఈ ఘర్షణలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పరిస్థితిని అదుపులోకి తేవడానికి యత్నిస్తున్నారు.

మరిన్ని వార్తలు