శెనక్కాయలు తిన్నాడని చంపేశాడు!

7 Jan, 2016 22:14 IST|Sakshi
శెనక్కాయలు తిన్నాడని చంపేశాడు!

కెరమెరి(ఆదిలాబాద్): తన చేనులో శెనక్కాయలు తిన్నాడని జరిగిన గొడవ ఒకరి మరణానికి దారితీసింది. ఆదిలాబాద్ జిల్లా కెరమెరి మండలం నిశాని గ్రామానికి చెందిన లక్ష్మణ్ తనచేనులో వేరుశెనగ పంట వేశాడు. గురువారం మధ్యాహ్నం గ్రామానికే చెందిన మడావి గంగు (45) ఆ చేనులో వేరుశెనగకాయలు తింటుండగా లక్ష్మణ్ అతనితో గొడవపడ్డాడు.

ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. తీవ్ర ఆగ్రహానికి లోనైన లక్ష్మణ్ రాయితో గంగు తలపై కొట్టటంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. ఈ మేరకు ఏఎస్సై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు