ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

12 Jun, 2017 23:44 IST|Sakshi

అనంతపురం సెంట్రల్‌ : మద్యానికి బానిసైన ఓ వ్యక్తి జీవితంపై విరక్తి చెంది ఆదివారం అర్ధరాత్రి ఇంటిపైకప్పుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. టూటౌన్‌ ఎస్‌ఐ శివగంగాధర్‌రెడ్డి కథనం మేరకు.. ఆదర్శనగర్‌లో నివాసముంటున్న బేల్దారి రాజేంద్ర(26) మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో భార్య, పిల్లలు దూరంగా ఉంటున్నారు. నాటి నుంచి అమ్మా, నాన్నల వద్దే ఉంటున్న రాజేంద్ర ఆదివారం మనస్థాపం చెంది ఇంట్లో అంతా నిద్రపోయిన తర్వాత చీరతో ఇంటి పైకప్పుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయాన్నే గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్‌ ఎస్‌ఐ తెలిపారు. 

మరిన్ని వార్తలు