మానేపల్లి జ్యూయలర్స్‌

18 Aug, 2016 22:27 IST|Sakshi
మానేపల్లి జ్యూయలర్స్‌

హైదరాబాద్: వజ్రం కలకాలం నిలిచి ఉంటుంది. అతివ అందమైన చిరునవ్వులా. వజ్రాల మెరుపులతో పోటీ పడి తారలు తళుక్కుమంటుంటే ఆ ఆభరణాల ప్రదర్శన నవ కాంతులీనింది. సోమాజిగూడలోని మానేపల్లి జ్యూయలర్స్‌ షోరూమ్‌ వజ్రాభరణాల ప్రదర్శన ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఔత్సాహిక నటి హర్షద పాటిల్, మోడల్స్‌ సంస్థ రూపొందించిన తాజా ఆభరణాలను ప్రదర్శించారు. శ్రావణమాస వేడుకలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన ఈ నెల 25 వరకూ కొనసాగుతుందని సంస్థ నిర్వాహకులు మురళీకృష్ణ, గోపీ కృష్ణ తెలిపారు.

మరిన్ని వార్తలు