శ్రీవారి సేవలో ప్రముఖులు

2 May, 2016 10:50 IST|Sakshi

తిరుమల శ్రీ వెంకటేశ్వరుడిని సంగీత దర్శకుడు మణిశర్మ సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో దర్శించుకున్నారు. అలాగే, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.రవికుమార్ వెంకన్న దర్శనానికి వచ్చారు.  శాసనసభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, చిత్తూరు జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ కూడా ఇవాళ స్వామివారి దర్శనం చేసుకున్నారు.


మరో వైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కోనేరు ప్రసాద్ ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో పాటు తిరుమల వచ్చిన ఆయన వీఐపీ విరామ సమయంలో పూజలు నిర్వహించారు.

మరిన్ని వార్తలు