పలు రైళ్ల పునరుద్ధరణ

26 Sep, 2016 00:28 IST|Sakshi
డోర్నకల్‌ : విజయవాడ– కాజీపేట మార్గంలో పలు రైళ్లను ఆదివారం పునరుద్ధరించారు. విజయవాడ వైపు వెళ్లే కృష్ణా, ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లతో పాటు కాజీపేట వైపు వెళ్లే కృష్ణా, ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ను నడిపించారు. సోమవారం నుంచి మరి కొన్ని రైళ్లను పునరుద్ధరించనున్నట్లు అధికారులు తెలిపారు.
సిద్ధమువుతున్న ఇసుక, రాయి..
డోర్నకల్‌ రైల్వే స్టేషన్‌ లోని గూడ్సు యార్డులో ఇసుక, రాయితో కూడిన గూడ్సు బోగీలను సిద్ధం  చేస్తున్నారు. శనివారం 20 బోగీలతో కూడిన ఇసుక, రాయి లోడు రైలును కాజీపేటకు పంపించారు. వరదలతో రైలు పట్టాలకు ఎలాంటి ముప్పు లేకుండా ఉండేందుకు రైల్వే అధికారులు ముందుజాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. ఆదివారం మరో 20 బోగీలలో ఇసుక, రాయిని సిద్ధం చేశారు. 
మరిన్ని వార్తలు