ఒడిశాలో మావోయిస్టుల ఘాతుకం

15 Jan, 2016 10:09 IST|Sakshi
ఒడిశాలో మావోయిస్టుల ఘాతుకం
ఒడిశా: మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. జిల్లాలోని బొరిగి గ్రామంలో ఇన్ ఫార్మర్ గా పని చేస్తున్నారనే నెపంతో ఒకరిని హతమార్చారు. స్థానిక గ్రామానికి చెందిన నచ్ మూలి ఆదివాసి సంఘంనేత నాచక రోలిని శుక్రవారం మావోయిస్టులు కాల్చి చంపారు. మృత దేహం వద్ద శ్రీకాకుళం- కోరాపుట్ ఎవోబీ కార్యదర్శి దయ పేరుతో లేఖను వదిలి వెళ్లారు. మావోయిస్టు కార్యకలాపాలను పోలీసులకు చేరవేస్తున్నాడని హతమార్చినట్టు లేఖలో పేర్కొన్నారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. 
>
మరిన్ని వార్తలు