ఆర్‌యూ లో ధర్నా

27 Jan, 2017 00:47 IST|Sakshi
ఆర్‌యూ లో ధర్నా

కర్నూలు (ఆర్‌యూ) : ప్రత్యేక హోదా కోసం.. రాయలసీమ యూనివర్సిటీలో విద్యార్థులు గురువారం ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాయలసీమ యూనివర్సిటీ అధ్యక్ష, కార్యదర్శులు వినోద్, బీవీ రమణలు మాట్లాడారు. హోదా కోసం ఉద్యమిస్తున్న విద్యార్థులను అరెస్ట్‌ చేయడం దారుణమన్నారు. ఇప్పకైనా రాష్ట్ర ప్రభుత్వం హోదా కోసం ఉద్యమించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఆర్గనైజింగ్‌ కార్యదర్శి మోహన్, నాయక్, రమేష్, నిర్మల్, రాము, చలపతి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు