నిప్పంటించుకుని... మహిళ పరుగులు

23 Jun, 2016 13:10 IST|Sakshi

ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న మహిళ..మంటలకు తాళలేక పరుగులు తీసింది. శంషాబాద్ మండలం కాపుగడ్డలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. కుటుంబకలహాల నేపథ్యంలో కాపుగడ్డ బస్తీకి చెందిన ఓ మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. మంటలు వ్యాపించటంతో తాళలేక బయటకు పరుగెత్తుకుంటూ వచ్చింది. గమనించిన చుట్టుక్కల వారు మంటలను ఆర్పి వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

 

>
మరిన్ని వార్తలు