ఆత్మహత్య

16 Jan, 2017 23:36 IST|Sakshi
ఆత్మహత్య
= అదనపు కట్నం దాహానికి వివాహిత బలి 
= కారకులు, పరిస్థితుల గురించి వాయిస్‌ మెసేజ్‌ 
= డాడీ..క్షమించు! అంటూ తండ్రికి చివరి సందేశం 
= బెంగళూరులో ఆత్మహత్య.. అనంతపురం జిల్లాలో ఖననం 
 
తల్లిదండ్రులు : ఒక్కగానొక్క కూతురు. అమ్మాయి సంతోషంగా ఉండడమే మాకు కావాల్సిందని భావించారు. పెళ్లి సమయంలో రూ. కోటి నగదు. కేజీ బంగారం కట్నంగా ఇచ్చారు. అంతటితో ఆగలేదు. కూతురిపై ఉన్న మమకారంతో రూ. లక్షలు విలువ చేసే 35 సెంట్ల భూమిని కూతురి పేరిట రిజిస్ట్రేష¯ŒS చేయించారు.
 
భర్త : రెండేâýæ్ల పాటు ప్రేమించి చివరకు పెద్దోళ్లను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయిన తర్వాత రెణ్నెâýæ్ల నుంచే వేధించడం ప్రారంభించాడు. 
 
అత్త,మామలు : అదనపు కట్నం తీసుకొస్తేనే ఇంటికిరా. లేదంటే రావొద్దు. శూన్యమాసానికి ఊరికి వెళ్తున్నావు. మీ అమ్మ,నాన్నలను ఒప్పించి డబ్బులు తీసుకురా. లేదంటే శాశ్వతంగా నీకు శూన్యమాసమే.  
 
పోలీసులు : వరకట్న వేధింపులు, బెదిరింపుల కేసులో భర్త, అత్త, మామలతో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు. నెలల తరబడి చార్జ్‌షీట్‌ వేయలేదు. చివరకు చార్జ్‌షీట్‌ వేసినా కనీస విచారణ చేయలేదు. 
 
బంధువులు : భార్య,భర్తను కలిపి కాపురాన్ని నిలబెట్టాల్సింది పోయి వారిమధ్య మరింత ఆజ్యం పోశారు. భర్త తరఫున వకాల్తా పుచ్చుకుని భార్య, ఆమె తల్లిదండ్రులే తప్పు చేసినట్లు సమాజంలో ప్రచారం చేశారు.  
 
ఈ పరిస్థితుల మధ్య తనకు న్యాయం జరగదని, కట్టుకున్న భర్త, ఆత్తమామలు పెద్దోళ్లతో కలిసి తన తల్లిదండ్రులను ఎక్కడ ఇబ్బందులు పెడతారోనన్న భయంతో జాస్నవిరెడ్డి (25) ఆత్మహత్మకు పాల్పడింది. ఆత్మహత్యకు ప్రేరేపించిన కారణాలు, వ్యక్తుల వివరాలను నేరుగా పోలీసులు, లాయర్, బంధువుల సెల్‌ఫోన్లకు మెసేజ్‌లు పంపింది. తండ్రికి మాత్రం ‘నాన్నా...నన్ను క్షమించు’ అంటూ చివరి మెసేజ్‌ పెట్టింది.  
 
అనంతపురం : అదనపు కట్నం దాహానికి వివాహిత బలైంది. అనంతపురానికి చెందిన జాస్నవిరెడ్డి బెంగళూరులో ఆత్మహత్య చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. యల్లనూరు మండలం వెన్నపూసపల్లికి చెందిన సూర్యప్రతాప్‌రెడ్డి, రేవతి దంపతులకు ఒక కుమారుడు, కూతురు. వీరి కుటుంబం ప్రస్తుతం అనంతపురంలోని కోవూర్‌నగర్‌లో నివాసం ఉంటోంది. కూతురు జాస్నవిరెడ్డి చెన్నైలో టెక్‌ మైండ్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తుండేది.  
 
ప్రేమించిన యువకుడితో పెళ్లి  
జాస్నవిరెడ్డితో బంధువుల అబ్బాయి విద్యాసాగర్‌రెడ్డి సన్నిహితంగా తిరిగేవాడు. రెండేâýæ్ల పాటు ప్రేమిస్తున్నాని వెంటపడి అమ్మాయిని ఒప్పించాడు. ఈ క్రమంలో విద్యాసాగర్‌రెడ్డి బంధువులు అమ్మాయి తల్లిదండ్రులతో సంప్రదింపులు జరిపారు. ఒక్కగానొక్క కూతురి సంతోషం కోసం కాదనలేక 2015 మార్చి 12న అంగరంగవైభవంగా పెళ్లి చేశారు. పది రోజులకే జాస్నవిరెడ్డితో ఉద్యోగం మాన్పించిన భర్త హైదరాబాద్‌లో కాపురం పెట్టారు. 2015 మేలో శూన్యమాసమని కోడలిని పుట్టింటికి పంపారు.  
 
రూ.2 కోట్లు, ఇన్నోవా కారు కావాలని... 
పుట్టింటికి వచ్చిన జాస్నవిరెడ్డిని భర్త, అత్తమామలు అదనపు కట్నం కోసం వేధించడం ప్రారంభించారు. వ్యాపారం చేసుకునేందుకు రూ. 2 కోట్లు, ఇన్నోవా కారు కావాలంటూ బలవంతం చేయసాగారు. ఈ క్రమంలో అమ్మాయి తల్లిదండ్రులు పలువురి వద్ద పంచాయితీ చేయించినా లాభం లేదు. చివరకు పోలీసులను ఆశ్రయించారు. మహిళా పోలీస్‌స్టేçÙ¯ŒSలో ఫిర్యాదు చేశారు. కలిపేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

ఈ క్రమంలో నెలలు గడిచిన తర్వాత భర్త, వారి బంధువులు 8 మందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అంతే అదీ పక్కన పట్టేశారు. ఈ క్రమంలో అమ్మాయి బంధువులు డీఐజీని కలిసి జరిగిన అన్యాయాన్ని వివరించి, నిందితులపై చార్జ్‌షీటు దాఖలు చేయించారు. ఈ క్రమంలో పెనుకొండ డీఎస్పీ సుబ్బారావు ఈ నెల 11న ఇరు వర్గాల వారితో మాట్లాడారు. కాపురానికి తీసుకెâýæ్లబోమని, విడాకులూ ఇవ్వబోమని విద్యాసాగర్‌రెడ్డి, బంధువులు తెగేసి చెప్పారు.  

అందరికీ మెసేజ్‌లు పంపి... 
అయితే అప్పటికే బెంగళూరులో ఉంటున్న జాస్నవిరెడ్డి 11వ తేదీ జరిగిన పంచాయితీ వివరాలను తండ్రికి ఫో¯ŒS చేసి అడిగింది. జరిగిన విషయం చెప్పిన తండ్రి ఏం కాదులేమ్మా...నేనున్నాంటూ ధైర్యం చెప్పాడు. ఇంత జరిగినా తమకు న్యాయం జరిగేలా లేదని, తన తల్లిదండ్రులకు ఎక్కడ ఇబ్బందులు తెచ్చిపెడతారోనని భావించిన జాస్నవిరెడ్డి ఈ నెల 15న తెల్లవారుజామున రూములో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

ముందుగా పోలీసులు, లాయర్, బంధువులకు పలు వివరాలు వెల్లడిస్తూ రికార్డ్‌ వాయిస్‌ మెసేజ్‌ పంపింది. 5.30 గంటల సమయంలో తండ్రి సూర్యప్రతాప్‌రెడ్డి సెల్‌ఫో¯ŒSకు ఫో¯ŒS చేసి ‘డాడీ క్షమించు’ అంటూ మెసేజ్‌ పంపింది. 6 గంటల సమయంలో మహిళా పోలీస్‌స్టేషన్ నుంచి సూర్యప్రతాప్‌రెడ్డికి ఫో¯న్ వచ్చింది. ‘మీ పాప ఆత్మహత్య చేసుకున్నట్లు’ మెసేజ్‌ పంపిందని వెల్లడించారు. నిర్ఘాంతపోయిన ఆయన కూతురి ఫోన్ కు కాల్‌చేస్తే రిసీవ్‌ చేసుకోలేదు.

వెంటనే కారు తీసుకుని బెంగళూరుకు బయలుదేరారు. వెళ్లి చూడగా కూతురు విగతజీవిగా పడి ఉంది. అక్కడి పోలీసులు 304–బీ కేసు నమోదుచేశారు. సోమవారం సాయంత్రం అనంతపురం నగరానికి జాస్నవిరెడ్డి మృతదేహాన్ని తీసుకొచ్చారు. అనంతరం ఇక్కడి నుంచి సొంతూరు వెన్నపూసపల్లికి తీసుకెళ్లి ఖననం చేశారు. ఇదిలాఉండగా నగరంలోని సూర్యప్రతాప్‌రెడ్డి ఇంటివద్ద పదుల సంఖ్యలో ఎస్‌బీ పోలీసులు చేరుకుని వివరాలు ఆరా తీయడం విశేషం. 
 
మరిన్ని వార్తలు