అనుమానాస్పదస్థితిలో వివాహిత ఆత్మహత్య

29 Jan, 2017 15:33 IST|Sakshi

కోహెడ(సిద్ధిపేట జిల్లా): అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన కోహెడ మండలం వింజపల్లిలో చోటుచేసుకుంది. వివరాలు..వింజపల్లి గ్రామానికి చెందిన మౌరవ్వ(22)కు ఏడాది క్రితం చిగురుమామిడి మండలం రేకొండ గ్రామానికి చెందిన ఓ యువకుడితో వివాహం జరిగింది. వీరిద్దరూ శనివారం వింజపల్లి వచ్చారు. ఏమైందో ఏమో కానీ ఆదివారం ఉదయం మౌరమ్మ ఉరి వేసుకొని మృతి చెందింది. ఉదయంపూట భర్త ఇంట్లో లేకపోవడంతో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
 

మరిన్ని వార్తలు