మొబైల్ షాపులో భారీ చోరీ

11 Nov, 2016 09:01 IST|Sakshi

నందికోట్కూర్(కర్నూలు): మొబైల్ షాపులో దొంగలు పడి ఫోన్లు ఎత్తుకెళ్లిన సంఘటన కర్నూలు జిల్లా నందికోట్కూర్‌లోని పాతబస్టాండ్ వెనుక భాగంలో గురువారం రాత్రి జరిగింది. స్థానికంగా ఉన్న ఓ మొబైల్ షాపు షట్టర్ పగలగొట్టిన గుర్తుతెలియని దుండగులు దుకాణంలో ఉన్న విలువైన మొబైల్‌ఫోన్లు ఎత్తుకెళ్లారు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు