రాజంపేట రూరల్: పట్టణంలో మట్కాను రాయించే ఆర్గనైజర్ తాడిపత్రి తిరుపాల్ను అరెస్టు చేసినట్లు పట్టణ సీఐ పల్లపు మోహన్కృష్ణ తెలిపారు. శుక్రవారం రాత్రి స్థానిక అర్బన్ పోలీసుస్టేషన్లో ఆయన విలేకరుల ఎదుట నిందితుడిని హాజరుపరిచారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ స్థానిక హెచ్పీ పెట్రోలు బంక్ వద్ద అతను మట్కా రాయిస్తూ ప్రజల చేత డబ్బు వసూలు చేస్తుండగా పట్టుకున్నట్లు పేర్కొన్నారు. తిరుపాలు గతంలో మున్సిపాలిటీలో స్వీపర్గా పని చేశారన్నారు. అతని వద్ద నుంచి రూ.27 వేలు నగదు, మట్కా స్లిప్పులను స్వాధీనం చేసుకున్నామన్నారు. విలేకరుల సమావేశంలో ఎస్ఐ ఎంవీ రెడ్డయ్య, ఏఎస్ఐ మలిశెట్టి చంద్రశేఖర్గౌడ్, కానిస్టేబుల్ జీ.నరసింహులు పాల్గొన్నారు.