మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌గా రాధ

29 Sep, 2016 00:21 IST|Sakshi
డాక్టర్‌ రాధ
హన్మకొండ చౌరస్తా : హన్మకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాధకు మహబూబ్‌నగర్‌ మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌గా పదోన్నతి లభించిం ది. ఈ మేరకు డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేష¯ŒS ఉత్తర్వు లు జారీ చేసినట్లు తెలిసింది. రాధ ప్రస్తుతం జీఎంహెచ్‌ ఎఫ్‌ఏసీ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లాల విభజన నేపథ్యంలో మహబూబ్‌నగర్‌ జిల్లాకు బదిలీ చేస్తూ పదోన్నతి క ల్పించినట్లు సమాచారం. ఈ విషయమై సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాధ మాట్లాడుతూ పదోన్నతి కల్పిస్తూ బదిలీ చేయడం వాస్తవమే అన్నారు. పదోన్నతిని స్వీకరించాలా ఇక్కడే కొనసాగాలా అనే అంశంపై ఆలోచిస్తున్నట్లు పేర్కొన్నారు.
 
 
మరిన్ని వార్తలు