ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలి

13 Aug, 2016 01:03 IST|Sakshi
గూడూరు : విద్యార్థులు చదువయ్యాక ఉద్యోగానికే పరిమితం కాకుండా వ్యాపారం చేసి ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలని  ప్రముఖ వ్యాపారవేత్త, ఇన్‌టెక్‌ గ్రూపు సీఈఓ విమాన్‌ అన్నారు. స్థానిక ఆదిశంకర కళాశాలలో శుక్రవారం విద్యార్థులకు అవగాహన సదస్సు జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన విమాన్‌ మాట్లాడుతూ ఓ విద్యార్థి వ్యాపారవేత్తగా మారాలంటే ఎన్నో వ్యయప్రయాసలకు సన్నద్ధం కావాలన్నారు. తన అనుభవాలు చెప్పారు. కళాశాల ౖyð రెక్టర్‌ కష్ణకుమార్, డాక్టర్‌ విచమ్, మనీష్‌శర్మ, తిరుపతి వడకన్‌లు ప్రసంగించారు. ఎస్వీ రమణ, మల్లికార్జున, కొడాలి, ప్రభుకర్‌ తదితరులు పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు