'కాల్మనీ చర్చకు అడ్డుగానే అబేడ్కర్పై చర్చ'

17 Dec, 2015 19:16 IST|Sakshi

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావాలనే అసెంబ్లీని తప్పుదోవపట్టిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున గురువారం ఆరోపించారు. కాల్మనీ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ నేతలను కాపాడేందుకే ప్రభుత్వం అబేడ్కర్పై చర్చను అసెంబ్లీలో తెరపైకి తెచ్చిందని ఆయన విమర్శించారు. అంబేడ్కర్ను అడ్డుపెట్టుకొని చంద్రబాబు రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి చర్యలతో చంద్రబాబు దళిత ద్రోహిగా మిగిలిపోతారని నాగార్జున తెలిపారు.
 

మరిన్ని వార్తలు