మున్సిపల్ ఆఫీసులో మంత్రికి చేదు అనుభవం

11 Dec, 2015 15:45 IST|Sakshi

శ్రీకాళహస్తి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి శుక్రవారం శ్రీకాళహస్తి మున్సిపల్ ఆఫీసులో చేదు అనుభవం ఎదురైంది. మున్సిపల్ చైర్మన్ రాధారెడ్డి తీరుపై ఆగ్రహంగా ఉన్నటువంటి టీడీపీ కౌన్సిలర్లు మంత్రిని నిలదీశారు. రాధారెడ్డి విషయంలో మంత్రి ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. ఊహించని పరిణామంతో నివ్వెరపోయిన మంత్రి.. సాయంత్రం కలిసి ఈ విషయంపై మాట్లాడుతానని చెప్పి మున్సిపల్ ఆఫీసు నుండి వెళ్లిపోయారు.

 

మరిన్ని వార్తలు