ఎల్బీనగర్ పరిధిలోని హస్తినాపురంలో ఓ 17 ఏళ్ల మైనర్ బాలికపై అదే ఏరియాలో నివాసముంటున్న యాదగిరి అనే వ్యక్తి అత్యాచారం చేశాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.