తిరుమలలో భక్తుల అదృశ్యం

17 Jan, 2017 00:26 IST|Sakshi
సాక్షి, తిరుమల : తిరుమలలో వేర్వేరు ఘటనలో ఇద్దరు భక్తులు అదృశ్యమయ్యారు. ఈ నెల 9వ తేదీన శ్రీవారి ఆలయం ఎదురుగా అఖిలాండం వద్ద మహారాష్ట్రకు చెందిన గోపాల్‌రావ్‌ (65) తప్పిపోయాడు. అలాగే, ఈ నెల 13న మాధవ నిలయం వద్ద అనంతపురం జిల్లా తనకల్లు మండలం కదిరి సమీపంలోని రెడ్డివారిపల్లికి చెందిన బి.సత్యనారాయణ (51) తప్పిపోయాడు. వారి ఆచూకీ లభించలేదు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు.
 
మరిన్ని వార్తలు