సీఆర్డీఏ ఆఫీసు వద్ద ఎమ్మెల్యే ఆర్కే ఆందోళన

6 Feb, 2016 15:14 IST|Sakshi

గుంటూరు: గుంటూరు జిల్లాలోని మంగళగిరి మండలం నిడమర్రులో శనివారం సీఆర్డీఏ ఆఫీసు ఎదుట వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే(ఆళ్ల రామకృష్ణారెడ్డి) ఆందోళనకు దిగారు. ఏడున్నర ఎకరాల ఎసైన్డ్ భూమిని ఇతరుల పేర్లతో నమోదు చేయటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు, టీడీపీ కార్యకర్తలు ప్రభుత్వ భూమిని దోచుకుంటున్నారని ఆర్కే మండిపడ్డారు. వివాదాస్పద భూమి వివరాలను పది రోజుల్లో ఇస్తామని ఎమ్మెల్యేకు ఈ సందర్భంగా అధికారులు హామీ ఇచ్చారు.
 

>
మరిన్ని వార్తలు