మోడీ పర్యటన వాల్‌పోస్టర్‌ ఆవిష్కరణ

5 Aug, 2016 23:37 IST|Sakshi
మోడీ పర్యటన వాల్‌పోస్టర్‌ ఆవిష్కరణ
చెన్నూర్‌ : ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఈ నెల 7న రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా హైదరాబాద్‌లోని లాల్‌ బహుదూర్‌ స్టేడియంలో నిర్వహించే బీజేపీ బూత్‌ స్థాయి కార్యకర్తల సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని కోరుతూ శుక్రవారం స్థానికంగా బీజేపీ నాయకులు వాల్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు.
         చెన్నూర్‌ మండలం నుంచి 500 మంది ముఖ్య కార్యకర్తలు సమ్మేళనంలో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ మండల, పట్టణ అధ్యక్షులు చల్లా రాంరెడ్డి, రేవేల్లి మహేశ్, ఎంపీటీసీ భీంమల్లేశ్, నాయకులు భాస్కర్‌ రెడ్డి, మల్లారెడ్డి, సమ్మిరెడ్డి, చారి, రమేశ్‌గౌడ్, తిరుపతిరెడ్డి, రావుల తిరుపతి, రాంమూర్తి గౌడ్, గోపాల్‌గౌడ్, దివాకర్‌శర్మ పాల్గొన్నారు. 
 
 
మరిన్ని వార్తలు