టీటీడీపై మండిపడ్డ సినీ నటుడు మోహన్బాబు
సాక్షి, తిరుమల: వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ధ్వజస్తంభానికి నమస్కరించుకునే అవకాశం ఇవ్వకపోవడం దారుణమని సినీ నటుడు మోహన్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం వైకుంఠ ఏకాదశి దర్శనం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. భక్తుల మనోభావాలను టీటీడీ దెబ్బతీస్తుందన్నారు.
అతి ముఖ్యుల పేరుతో కొందరికి మాత్రమే ధ్వజస్తంభాన్ని తాకే అవకాశం ఇవ్వటం సరికాదని మండిపడ్డారు. ఏకాదశి రోజున ధ్వజస్తంభం చేతులతో సృశించి ఆథ్యాత్మిక అనుభూతిని పొందుతారని అలాంటి వాటిని దూరం చేయటం ధార్మిక సంస్థకు తగదన్నారు. టీటీడీలో ఒక్కోఅధికారి ఒక్కో నిబంధన అమలు చేయటం సరికాదని అన్నారు. టీటీడీ డబ్బున్నవాళ్లకి దగ్గరవుతూ, సామాన్యులకు దూరమవుతోందని విమర్శించారు. ఇలాంటి పరిస్థితులు తిరుమలలో సరికావన్నారు.