ఉద్యోగాల పేరుతో భారీ మోసం

18 Dec, 2015 13:38 IST|Sakshi

విశాఖ: విశాఖపట్నంలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి  ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ 66 మంది బాధితుల నుంచి లక్షల్లో వసూలు చేశాడు. మోసపోయామని భావించిన బాధితులు దీనిపై శుక్రవారం పోలీసు కమిషనర్ అమిత్ గార్గ్‌కు  ఫిర్యాదు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ ఉన్నతాధికారినని, తనకు హెచ్‌పీసీఎల్ జీఎం తెలుసనని భోగరాజు రామకృష్ణ అనే వ్యక్తి నిరుద్యోగులకు వల విసిరాడు. ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఒక్కొక్కరి నుంచి రూ.50 వేలు నుంచి రూ.2 లక్షల వరకు డబ్బు వసూలు చేశాడు. దీనిపై బాధితులు కమిషనర్కు ఫిర్యాదు చేశారు. కంచరపాలెం సీఐని ఆశ్రయిస్తే... తమపైనే తిరిగి కేసు పెట్టి అరెస్ట్ చేస్తానంటున్నాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

 

>
మరిన్ని వార్తలు