సాయిబాబా ఆలయంలో హుండీ చోరీ

29 Jan, 2016 09:02 IST|Sakshi

శ్రీకాకుళం : శ్రీకాకుళంలోని కిమ్స్ ఆసుపత్రి సమీపంలోని షిర్డీ సాయిబాబా ఆలయంలోని హుండీని గురువారం ఆర్థరాత్రి దుండగులు అపహరించుకుని పోయారు. ఆ విషయాన్ని శుక్రవారం ఉదయం గుర్తించిన ఆలయ సిబ్బంది.... వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం దేవాలయానికి చేరుకుని... దోపిడి జరిగిన తీరును పరిశీలించారు.

>
మరిన్ని వార్తలు